Pan India Heroes : ప్రబాస్, చరణ్, యష్ మాత్రమే ప్యాన్ ఇండియా హీరోలు.!

Pan India Heroes : ‘బాహుబలి’ సినిమాతో ప్రబాస్ ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. నో డౌట్.. ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నా ప్రబాస్ ప్యాన్ ఇండియా ఇమేజ్‌కి ఎలాంటి నష్టం రాలేదింతవరకూ.
‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’, లేటెస్టుగా ‘కేజీఎఫ్ చాప్టర్2’లతో కన్నడ స్టార్ యష్ కూడా ఆ లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక, తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతవరకూ ఎప్పుడూ ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టని రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అనూహ్యంగా ఆ ఇమేజ్ దక్కించుకున్నాడు.
అదేంటీ.? ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీయార్ కూడా వున్నాడు కదా. ఆయనకూ ప్యాన్ ఇండియా ఇమేజ్ దక్కింది కదా.. అంటారా.? ఏమోనండీ నాకు కనబడదు.. అని ఓ సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ మాదిరి, ఎన్టీయార్ ప్యాన్ ఇండియా ఇమేజ్‌ని కొందరు చూడలేకపోతున్నారు.
అలాగే, ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. కానీ, అల్లు అర్జున్ కూడా కనిపించడం లేదట వాళ్లకి. ఇంతకీ ఎవరు వాళ్లు.? ఏంటా కథ.? అంటే, బాలీవుడ్ ముద్దుగుమ్మలు. మొన్న మీరాచోప్రా. ఇప్పుడు రవీనా టాండన్.
ఎన్టీయార్ ఎవరో నాకు తెలీయదంటూ మొన్న మీరాచోప్రా చేసిన హంగామా అంతా ఇంతా కాదు, లెఫ్ట్ అండ్ రైట్ ఆడేసుకున్నారు ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈ ఇష్యూపై. తాజాగా సీనియర్ నటి రవీనా టాండన్ కూడా ఇదే మాట చెప్పుకొచ్చింది. ప్రబాస్, చరణ్, యష్ మాత్రమే ప్యాన్ ఇండియా స్టార్లు అని చెప్పుకొచ్చింది. అయ్యో అవునా.!  ఇదెక్కడి గొడవరా.. బాబూ.!