Omicron Updates in India: దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. ఎన్ని కేసులు నమోదు అయ్యాయి అంటే.!

Omicron Updates in India: కరోనా కొత్త వేరియంట్ చాపకింద నీరులా ప్రపంచమంతా వ్యాపిస్తుంది. ప్రపంచ దేశాలకు చుక్కలు చూపించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్ ను కూడా కలవరపెడుతుంది. దేశం వ్యాప్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా 422కు చేరుకుంది. అందులో 130 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొత్తగా ఇతర రాష్ట్రాలను కూడా కొత్త వేరియంట్ కబళిస్తుంది, ఒమిక్రాన్ కేసులలో అగ్రస్థానంలో మహారాష్ట్ర 108, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ 79, గుజరాత్ 43, తెలంగాణ 41, కేరళ 38, తమిళనాడు 34, కర్ణాటక 31 నిలిచాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,987 కేసులు నమోదు అయ్యాయి. అదే స‌మ‌యంలో ఈ కరోనా మహమ్మారికి 162 మంది బ‌ల‌య్యారు.దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,79,682 మంది క‌రోనాతో మ‌ర‌ణించినట్లు రిపోర్ట్స్ లో పేర్కొన్నారు. అలాగే.. దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ సంఖ్య రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది. కాగా.. గడిచిన 24 గంటల్లో 7,091 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రికవరీ అయిన వారి సంఖ్య 3,42,30,354 కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 76,766కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. సెకండ్ వేవ్ తర్వాత కరోనా కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. గ‌త వారం రోజులుగా క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతోన్న‌.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య మాత్రం భారీగా పెర‌డ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇంకో వైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వ‌ర‌కు మొత్తం 141.37 కోట్ల మందికి పైగా టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. కాగా.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కరోనా కొత్త వేరియంట్ విస్తరించకుండా ప్రభుత్వాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై నిబంధనలు విధించాయి. ఇదిలా ఉంటే… రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తుంది.