క‌రోనా ఎఫెక్ట్ : ఆ దేశంలో న్యూఇయ‌ర్ వేడుక‌లు రద్దు !

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌తంలో క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన దేశాలు..ఇప్పుడు అన్‌లాక్ వైపు కొన‌సాగుతున్నాయి. ఒక వైపు క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్టి అన్‌ లాక్ ‌లో ఉంటే.. జ‌ర్మ‌నీ దేశం మాత్రం లాక్‌ డౌన్ విధించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం డిసెంబ‌ర్ 16 నుంచి జ‌న‌వ‌రి 10వ తేదీ వ‌ర‌కు లాక్‌ డౌన్ విధించ‌నున్న‌ట్లు జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఎంజెలా మెర్కెలా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Covid - 19

అయితే ఆ దేశంలో కొత్త సంవత్స‌రం వేడుక‌ల‌పై కూడా నిషేధం విధించింది అక్క‌డి మంత్రిత్వ‌శాఖ‌. అంతేకాకుండా క్రిస్మ‌స్ పండ‌గ స‌మీపిస్తున్న నేప‌థ్యంలో క‌రోనా కేసులు పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో ప‌లు ఆంక్ష‌లు విధించింది.ఇప్ప‌టికే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో రెస్టారెంట్లు, బార్లు, ఇత‌ర కేంద్రాలు సైతం న‌వంబ‌ర్ నుంచి మూత‌ప‌డ్డాయి. చాలా కంపెనీలు త‌మ ఉద్యోగుల‌ను ఇంటి నుంచే ప‌ని చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

జ‌ర్మ‌నీలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండ‌టంతో కోవిడ్ ప్ర‌భావం న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ప‌డింది. ఇక క్రిస్మ‌స్ పండ‌గ సంద‌ర్భంగా కేవ‌లం ఐదుగురు మాత్ర‌మే ఒక చోట చేర‌డానికి అనుమ‌తి ఇచ్చింది. భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది. క్రిస్మ‌స్‌, న్యూఇయ‌ర్ వ‌స్తుండ‌టంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. అయితే మిగ‌తా యూర‌ప్ దేశాల‌తో పోలిస్తే క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో జ‌ర్మ‌నీ మెరుగ్గానే ఉంది.