షాకింగ్: భార‌త్ లో కొత్త వైర‌స్..అస్సాంలో హై అలర్ట్

ప్ర‌పంచ దేశాలు స‌హా భార‌త్ ను క‌రోనా వైరస్ ఒణికిస్తుంటే! స్వ‌దేశంలోని ఈశాన్య రాష్ర్టాలో మ‌రో వైర‌స్ ప్ర‌జ‌ల‌ను బెంబేలెత్తిస్తోంది. ఈశాన్య రాష్ర్టాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో క‌రోనా ప్ర‌భావం అంత‌గా లేదు. కానీ ఇప్పుడొచ్చిన వైర‌స్ ఆ రెండు రాష్ర్టాల ప్ర‌జ‌ల్లో అంత‌కంత‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా ఆ ప్లూ వైర‌స్ ను వైద్యులు గుర్తించారు. ఆప్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ గా పిల‌వ‌బ‌డే ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టికే అస్సాంలో 15 వేల పందులు మృత్యువాత ప‌డ్డాయి. ఇంకా మ‌రిన్ని పందుల‌కు ఈ వైర‌స్ సొకింది అన్న అనుమానం ఉంది. దీంతో ప‌దుల‌న్నింటీకి పరీక్ష‌లు నిర్వ‌హించే ప‌నిలో అక్క‌డి ప్ర‌భుత్వం ప‌డిన‌ట్లు స‌మాచారం.

ఓ ప‌క్క నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అయితే ఇలా ఎన్ని నివార‌ణ చర్య‌లు చేప‌ట్టినా ఒక మ‌నిషికి గ‌నుక ఈ వైర‌స్ సోకితే దాన్ని అదుపు చేయ‌లేమ‌ని భావించిన అక్క‌డ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ర్టంలో వైర‌స్ సోకిన పందుల‌న్నింటిని గురించి ఒకేసారి చంపేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేపధ్యంలోనే రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతానికి పందులు తిన‌కూడ‌ద‌ని…అస‌లు పంది వైపు చూడొద్ద‌ని హెచ్చ‌రిక‌ల‌కు జారీ చేసింది ప్ర‌భుత్వం.

ఆ రాష్ర్ట ప‌శుసంవ‌ర్ధ‌క మ‌రియి ప‌శు వైద్య విభాగం డైరెక్ట‌ర్ పులిన్ దాస్ నేతృత్వంలో ఈ ఆప‌రేష‌న్ జ‌రుగుతుందిట‌.అయితే పందుల‌ను చంప‌డం వ‌ల్ల వాటిపై జీవ‌నం సాగించే వారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంది. అస్సాంలో పంది మాంసానికి గిరాకీ ఎక్కువ‌. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి భారీ ఆర్ధిక స‌హాయం కావాల‌ని రాష్ర్ట ప్ర‌భుత్వం కోరింది. కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇవ్వ‌గానే పందుల‌పై ఆప‌రేష‌న్ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.