Kareena Kapoor: కరీనాకు సిగ్గు లేదంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

Netizens trolling Kareena Kapoor Khan along with Amrita Arora

Kareena Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (బెబో), ఆమె స్నేహితురాలైన అమృతా అరోరాలకు కొన్నిరోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. కోవిడ్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘించి అనేక బాలీవుడ్ పార్టీలకు హాజరయ్యారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరిపై ట్రోలింగ్ కూడా జరిగింది. ట్రోలింగ్ దెబ్బకు కరీనా మేనేజర్ మీడియా ముందుకొచ్చి ఆమె తప్పు లేదని, కోవిడ్ నిబంధనలను ఆమె పాటించేదని, ఒక వ్యక్తి తప్పిదం వల్లనే ఇలా జరిగిందని వివాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

అయితే ఇటీవలనే ఈ ఇద్దరూ స్నేహితులు కరోనా నుండి సేఫ్ గా బయటపడ్డారు. ఇక ఈ ఆనందంలో సన్నిహిత స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నారు. తారా సుతారియా, ఆదార్ జైన్, మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబందించిన ఫొటోస్ బయటకి రావటంతో వాటిని చూసిన నెటిజన్లు మరోసారి వీరిపై మండిపడుతున్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండకుండా మరలా అలానే చేయటమేంటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. అమృతా అరోరాతో పాటు కరీనా కపూర్ ఖాన్ కు సిగ్గు లేదని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. వీరి నిర్లక్ష్యపు ప్రవర్తనతో మరెందరికో ప్రమాదం వస్తుందని, ఇకనైనా పార్టీలను ఆపి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇక రానున్న న్యూ ఇయర్ వేడుకలను ఏ రేంజ్ లో చేసుకుంటారో అని ఇంకొందరు వెక్కిరిస్తున్నారు.