సుధీర్ స్థానం లో రష్మీని చూడలేకపోతున్న అభిమానులు.. సుధీర్ కావాలంటూ డిమాండ్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ అతి తక్కువ సమయంలోనే టీమ్ లీడర్ గా మారిపోయారు.ఇలా టీం లీడర్ గా కొనసాగుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న సుధీర్ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ సుడిగాలి సుదీర్ ప్రస్తుతం హీరోగా బిజీ అయ్యారు.ఇకపోతే బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సుదీర్ జబర్దస్త్ కార్యక్రమం అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.

ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాల నుంచి తప్పకున్నా సుధీర్ స్టార్ మాలో ప్రసారమౌతున్న కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి సుడిగాలి సుదీర్ తప్పుకోవడంతో ఆ స్థానాన్ని రష్మి భర్తీ చేశారు. గత వారం ప్రసారమైన కార్యక్రమంలో భాగంగా రష్మీ యాంకర్ గా వ్యవహరించారు. సుధీర్ స్థానంలో రష్మీని చూడటానికి అభిమానులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం పై సుధీర్ అభిమానులు స్పందిస్తూ తిరిగి ఈ కార్యక్రమానికి సుధీర్ రావాలంటూ పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

సుధీర్ లేని కార్యక్రమం మేం కూడా చూడమంటూ అభిమానులు సుధీర్ పై ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నారు.సుధీర్ కన్నా ఇండస్ట్రీలో ముందుగా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందిన రష్మినీ సుధీర్ అభిమానులు ఈ కార్యక్రమంలో యాంకర్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందుకే వీ వాంట్ సుధీర్ అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.మరి అభిమానుల డిమాండ్ మేరకు మల్లెమాల తిరిగి సుదీర్ ఈ కార్యక్రమానికి తీసుకు వస్తారా లేదా ఆ స్థానంలో రష్మీని యాంకర్ గా కొనసాగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.