ఆడపడుచు కట్నం కింద విగ్నేష్ సోదరికి పెద్ద ఎత్తున కానుకలు ఇచ్చిన నయనతార?

నయనతార విగ్నేష్ శివన్ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటి కావడంతో వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఈ క్రమంలోనే వీరి వివాహం ఎంతో ఘనంగా జరగడంతో వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి సమయంలో ఒకరికొకరు ఎంతో ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.

దర్శకుడు విగ్నేష్ నయనతారకు కోట్లలో ఖరీదు చేసే బంగారు ఆభరణాలను కానుకగా ఇవ్వగా నయనతార కూడా ఏమాత్రం తగ్గకుండా ఏకంగా 20 కోట్ల ఖరీదు చేసే ఇంటిని తన భర్త పేరు పై రాసి ఇచ్చారు. ఈ విధంగా ఒకరికొకరు పెద్దఎత్తున ఖరీదైన వస్తువులను కానుకగా ఇచ్చి పుచ్చుకున్నారు. విగ్నేష్ శివన్ కి మాత్రమే కాకుండా ఆయన సోదరి ఐశ్వర్యకు కూడా నయనతార భారీగా కట్నకానుకలు ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది. నయనతార ఆడపడుచు కట్నం కింద ఐశ్వర్యకు ఏకంగా 30 లక్షలకు పైగా ఖర్చు చేశారని సమాచారం.

విగ్నేష్ సోదరి ఐశ్వర్యకు 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న నయనతార తన ప్రియుడిని వివాహం చేసుకోవడంతో ఎంతో మంది అభిమానులు వీరికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే పెళ్లి అయిన మరుక్షణమే ఈ జంట తిరుమల స్వామివారిని దర్శించుకొని తిరుమలలో సందడి చేశారు.వివాహమైన తర్వాత నయనతార వెండితెరపై నటించరని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది