Nithya menon: మ్యూజిక్ రియాల్టీ షో న్యాయనిర్ణేతగా నిత్యామీనన్…. వెల్లడించిన ఆహా!

Nithya menon: మన దేశంలో ఎన్ని ఓటిటి చానల్స్ ఉన్న మన తెలుగు వారు స్థాపించిన ఆహా అన్నిటిలోకి భిన్నంగా దూసుకెళ్తోంది. సినిమాలు వెబ్ సిరీస్ లు లాంటివి కాకుండా రియాల్టీ షో లు,టాక్ షో లతో ఆహా విభిన్నంగా ప్రజలను అలరిస్తోంది. నందమూరి బాలకృష్ణ తో చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎన్ని రికార్డ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ టాక్ షోతో సరికొత్త బాలకృష్ణ అందరికీ పరిచయమయ్యారు. అంతే కాకుండా ప్రతి వారం ఒక కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించడం, ఇతర భాషా సినిమాలను కూడా తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయడం వలన ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది.

ఇప్పుడు ఇంకా వినూత్నంగా ఒక సింగింగ్ రియాల్టీ షో ను ప్లాన్ చేస్తోంది. బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ షో ద్వారా ఎంతోమంది తెలుగు సింగర్స్ ని పరిచయం చేయనుంది. తెలుగు ఇండియన్ ఐడల్ గా ఈ షోనీ పరిచయం చేయబోతున్నారు. దీని హోస్టింగ్ బాధ్యతను ఇండియన్ ఐడల్ విజేత శ్రీ రామచంద్రకు అప్పగించినట్టు సమాచారం. ఇక వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని సమాచారం.

మరొక న్యాయనిర్ణేతగా తన విలక్షణ నటనతోనే కాకుండా గాత్రం కూడా అందర్నీ ఆకట్టుకున్న హీరోయిన్ నిత్యామీనన్ పేరువినిపిస్తుండటం విశేషం. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నిత్యామీనన్ పాటలు కూడా పాడింది. ప్రస్తుత హాటెస్ట్ మూవీ బీమ్లా నాయక్ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు నటించింది. తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా చేస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు ఆహా వేదికగా వస్తున్న రియాల్టీ షోలో న్యాయనిర్ణేతగా ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. దీనికి సంబంధించిన ప్రోమోని త్వరలోనే ఆహా రిలీజ్ చేస్తోందని సమాచారం.