రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకున్న ముకేశ్ అంబానీ..

అత్యంత సంపన్నుడు, రిలయన్స్ చైర్ పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా రిలయన్స్ జియో యూనిట్ డైరెక్టర్ భాధ్యతలు నుంచి తప్పుకున్నారు. ఇక నూతన చైర్మన్ గా ఆకాశ్ అంబానీ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆకాశ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు మోస్తున్నారు.

ఇక ముఖేష్ అంబానీ రాజీనామా ఈనెల 27 నుంచి వర్తిస్తుంది అని తెలిశాయి. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ గా పంకజ్ మోహన్ పవార్ పగ్గాలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27న నిర్వహించిన జియో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయం గురించి తీర్మానించారు. కొత్త ఎండీగా పంకజ్ ఐదేళ్ల పాటు కొనసాగుతారని తెలిసింది. ఇక స్వతంత్ర డైరెక్టర్లుగా కేవీ చౌదరి, రమీందర్ సింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.