ఐపీఎల్ కోసం ముంబై చేరుకున్న బస్సుపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు!

ఐపీఎల్ టోర్నీ సమయం దగ్గరకి వస్తున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు నిన్న రెండు బస్సుల్లో ముంబైలో కొలాబాలో ఉన్న తాజ్ ప్యాలెస్ హోటల్ కు చేరుకున్నారు. దీంతో ఆ బస్సులపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు దాడి చేశారు.

ఇదంతా ఆ జట్టును ఉద్దేశించి చేసింది కాదని.. కేవలం బయట రాష్ట్రాలకు చెందిన వారి బస్సులను అద్దెకు తీసుకోవడం వల్ల ఇక్కడి స్థానికులకు ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో అలా చేశామని ఆ సేన నేత సంజయ్ నాయక్ తెలిపాడు. అందుకే దాని మీద నిరసన తెలిపేందుకు దాడి చేశామని అన్నాడు. ఇదివరకు చాలా సార్లు చెప్పామని.. అయినా కూడా ఇతర రాష్ట్రాల బస్సులు అనుమతించడం వల్ల ఇలా జరిగిందని తెలిపాడు.