Mirai-OG: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా రేపు విడుదల కానుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సినిమా మీద ఉన్న హైప్ తో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. అడ్వాన్స్ సేల్స్ తోనే దాదాపు 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఓజీ సినిమా. మామూలుగానే స్టార్ హీరోల సినిమాలు వస్తే థియేటర్స్ అన్ని ఆ సినిమానే వేస్తాయి.
మల్టీప్లెక్స్ లలో మాత్రమే వేరే సినిమాలకు స్క్రీన్స్ దొరుకుతాయి. అలాంటిది పవర్ స్టార్ సినిమా, ఇంత హైప్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్, మల్టిప్లెక్స్ స్క్రీన్స్ అన్ని ఓజీ తోనే నిండిపోతాయి. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు 550 షోలు వేస్తున్నారు. అవన్నీ ఆల్రెడీ హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. అయితే కొన్ని స్క్రీన్స్ మాత్రం గత రెండు వారాలుగా ఆడుతున్న సినిమాలు నడుస్తున్నాయి. అయితే ఇటువంటి టైమ్ లో పవన్ పై ఉన్న అభిమానంతో మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జ, నిర్మాత విశ్వప్రసాద్ ఒక డెసిషన్ తీసుకున్నారు.
ఓజీ రిలీజ్ సెప్టెంబర్ 25న మిరాయ్ సినిమా ఆడే థియేటర్స్, స్క్రీన్స్ అన్ని కూడా ఓజీ సినిమాకు ఇవ్వాలని నిర్మాత విశ్వప్రసాద్ డిసైడ్ అయ్యారట. దీంతో గురువారం మిరాయ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో షోలు పడట్లేదు. మళ్లీ శుక్రవారం నుంచి సెలెక్టెడ్ స్క్రీన్ ల్లో మిరాయ్ సినిమా వేయనున్నారు. మిరాయ్ నిర్మాత విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్ కి క్లోజ్ అని అందరికి తెలిసిందే. ఇక తేజ సజ్జ చిన్నప్పట్నుంచి మెగా అభిమాని అని తెలిసిందే. దీంతో మిరాయ్ యూనిట్ తీసుకున్న నిర్ణయానికి పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కదా అసలైన అభిమానం అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mirai-OG: ఇది కదా అభిమానం అంటే.. పవన్ కోసం ఏకంగా సినిమా ఆపేస్తున్న హీరో, నిర్మాతలు!
