పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ మంత్రి ఆర్కే రోజా..

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్ కే రోజా ఫైర్ అయ్యారు. పవన్ పోరాటం ప్రజల కోసం కాదు అని.. ఆయన చేసే పోరాటం పొత్తుల కోసం అని అన్నారు. 2019లో పవన్ కళ్యాణ్ ను ప్రజలు రెండు చోట్ల ఓడించారు అని.. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అవుతుందని అన్నారు.

అంతే కాకుండా చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతం అంటూ.. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. బద్వేలు కు మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ కే వస్తుంది అని.. అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తున్న జనసేన, తెలుగుదేశం పార్టీలో ప్రయత్నాలు ఫలించవని అన్నారు.