Minister Rajini: చంద్రబాబుపై మంత్రి విడదల రజిని ఫైర్.. ఇదంతా రాజకీయమే అంటూ!

Minister Rajini: ప్రస్తుతం బెజవాడ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం గురించి పలువురు రాజకీయ నాయకులు స్పందించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ బాధితురాలి దగ్గరికి వెళ్లి పరామర్శించార. ఇప్పటికే జగన్ తమ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయగా.. చంద్రబాబు అక్కడికి వెళ్లి పరామర్శించాడు. ఆ సమయంలో అక్కడ మహిళా కమిషనర్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ పై టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఈ విషయం గురించి విడదల రజని ఘాటుగా స్పందించింది. టీడీపీ హయాంలో జరిగిన ఘోరాలను మరిచారా అంటూ.. వాసిరెడ్డి పద్మ పై చంద్రబాబు తదితరుల దాడికి పాల్పడ్డారంటూ ఫైర్ అయ్యింది. అంతేకాకుండా అత్యాచార ఘటనపై తమ ప్రభుత్వం వెంటనే స్పందించింది అని తెలిపింది. ఇక ఈ ఘటనను చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యింది.