మాజీ మంత్రి పై మండిపడ్డ మేరుగు నాగార్జున..

తాజాగా ఏపీ మంత్రి మేరుగు నాగార్జున టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పై ఫైర్ అయ్యాడు. ఆయన తాజాగా గుంటూరు మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నక్కా ఆనందబాబు బ్రతుకు ఏంటో అందరికీ తెలుసని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు మట్టి, ఇసుక తో భారీ దోపిడీ చేశాడు అని అన్నాడు.

ఇక వేమూరు నియోజకవర్గం లో వైఎస్ ఆర్ జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లకు అనుమతులతో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని, పంచాయతీ తీర్మానాలు కూడా ఉన్నాయని అన్నాడు. అక్రమ మట్టి తవ్వకాలు అంటూ నక్కా ఆనందబాబు ఇటువంటి హడావిడి చేయడానికి ప్రయత్నించాడు అని.. కానీ ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు అని అన్నాడు.