ప్యన్ ఇండియాపై మెగా హీరో దృష్టి

మెగా హీరోల్లో తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ వెర్సటైల్ హీరో అనిపించుకుంటున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కి భిన్నంగా కథలను ఎంచుకుంటుంటాడు. ప్రస్తుతం ‘గని’ సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్, తదుపరి ఓ బైలింగ్వల్ మూవీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

బాలీవుడ్‌లో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ, మెగా ప్రిన్స్‌తో తాజాగా చర్చలు జరిపిందట. ఓ బైలింగ్వల్ మూవీ కోసం స్టోరీ లైన్ కూడా వినిపించిందట. ఆ స్టోరీ లైన్ పట్ల వరుణ్ కూడా పాజిటివ్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్‌కి సుపరిచితుడైన ఓ డైరెక్టర్ ఈ ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నాడట.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లోనే వెల్లడి కానున్నాయని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. అంటే మెగా ప్రిన్స్ కూడా త్వరలోనే ప్యాన్ ఇండియా స్టార్ కానున్నాడన్న మాట.

కాగా, వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రం డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్‌తో జత కడుతోంది. కిరణ్ కొర్రపాటి ‘గని’కి దర్శకుడు.