Muttamshetty Krishna prasad: మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ గ్యాప్.. గురించి క్లారిటీ ఇచ్చిన బన్నీ మేనమామ..?

Muttamshetty Krishna prasad: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న బంధం గురించి మనందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాలలో ఏ ఒక్క చిన్న ఫంక్షన్ జరిగినా కూడా అందరూ కలిసి మెలిసి ఆ ఫంక్షన్ లో ఆడిపాడి సందడి సందడి చేస్తూ ఉంటారు. అల్లు ఇంట్లో ఫంక్షన్ జరిగితే మెగా ఫ్యామిలీ పాల్గొనడం, అదేవిధంగా మెగా ఇంట్లో ఫంక్షన్ జరిగితే అల్లు ఫ్యామిలీ పాల్గొనడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రెండు ఫ్యామిలీలు పండుగ సమయాలలో కలిసిపోయి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉంటారు.

ఇక భారీ అభిమాన హీరోలు అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి కూడా అవధులు లేకుండా పోతాయి. ఇక ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా అల్లు, మెగా ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ వచ్చింది అన్న వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. తాజాగా ఇదే విషయంపై అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి కృష్ణ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అతను కథలు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ కి అల్లు ఫ్యామిలీ కి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. అందుకే ముత్తంశెట్టి మీడియా, ముత్తంశెట్టి బ్రదర్స్ నిర్మాతలుగా లైమ్ లైట్ లోకి వచ్చారు వినిపించిన వార్తల్లో నిజమెంత? అని అడగగా..

ఆ విషయంపై వెంటనే రియాక్ట్ అయి కృష్ణ ప్రసాద్.. అది నూటికి నూరు శాతం అబద్దం అంటూ ఘాటుగా స్పందించాడు. అల్లు అర్జున్ తన మేనమామలకు మంచి గుర్తింపు రావాలి అన్న ఒక్క ఉద్దేశంతో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారు తప్ప.. జనం మాట్లాడుకుంటున్న దానికీ, మా ఎంట్రీ కి ఎటువంటి సంబంధం లేదు అని కృష్ణ ప్రసాద్ తెలిపారు. మన స్వతంత్ర భారతదేశంలో పబ్లిక్ కి ఏదైనా అనుకునే స్వేచ్ఛ ఉంది కాబట్టి అది వాళ్ళ ఇష్టం అని తేల్చి చెప్పేశారు. అంతే కాకుండా అల్లు అర్జున్ కీ తన మేనమామ లతో కలిసి ఒక మంచి ప్రాజెక్టు చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సినిమాలో మమ్మల్ని భాగం చేశారు అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.