మాస్ అప్డేట్ : “భీమ్లా నాయక్” ఆగమనంలో ఎలాంటి మార్పు లేదు.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా లు హీరోలుగా నిత్యా, ఐశ్వర్య మీనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న మాస్ చిత్రం “భీమ్లా నాయక్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా ఆల్రెడీ సంక్రాంతి రేస్ లో ఉంది అని తెలిసిందే.

కానీ మధ్యలో చిత్ర యూనిట్ కాస్త సందిగ్ధం లోకి వెళ్లారు. అయినా ఎలాంటి సినిమా ఉన్నా కూడా భీమ్లా నాయక్ వెనకడుగు వేసేది లేదని క్లియర్ చేసేసారు ఇప్పుడు. సంగీత దర్శకుడు థమన్ బర్త్ డే కానుకగా ఈ మాస్ అప్డేట్ ని చిత్ర యూనిట్ తెలియజేసారు.

భీమ్లా నాయక్ వచ్చే జనవరి 12 నే థియేటర్స్ లో రాబోతుంది అని సంక్రాంతి రేస్ ని మరింత హీటెక్కించింది. మరి ఈ పోటీ ఎలా ఉంటుందో చూడాలి ఇక. ఈ సినిమాకి త్రివిక్రమ్ కూడా వర్క్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.