Married Women: భర్త ఓ కూతురితో ఎంతో ఆనందంగా సాగిపోతున్న జీవితం.. ఊహించని రీతిలో కబళించిన మృత్యువు!

Married Women: ఆమెకు 25 సంవత్సరాలు.. ఎంతో సంతోషంగా చూసుకునే భర్త, సొంత బిడ్డలా ఆదరించే అత్తమామలు, ఈ దంపతులకు ఐదు సంవత్సరాల అందమైన కూతురు..ఏ విధమైనటువంటి సమస్యలు గొడవలు లేకుండా ఎంతో ఆనందంగా సాగిపోతున్న ఆ ఇల్లాలి జీవితంలోకి ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. ఎంతో సరదాగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విషాదం నింపింది. వారి సంతోషం చూసి మృత్యువుకి కుళ్ళు పుట్టిందా అనే రీతిలో మృత్యువు ఆమె ప్రాణాలను తీసుకువెళ్ళిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని జట్టారి పట్టణానికి సమీప గ్రామంలో నివాసం ఉండే యాదవేంద్ర సింగ్ అలియాస్ యాదూకు, ప్రియాంకకు (25) కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఐదు సంవత్సరాల కూతురు కూడా ఉంది. ప్రతి రోజులాగే ప్రియాంక జనవరి 3వ తేదీ ఉదయం స్నానానికని బాత్రూంకి వెళ్ళింది. అయితే ఆమెకు వేడి నీళ్ళ స్నానం అలవాటు ఉండటంతో బాత్ రూమ్ లోనే కరెంట్ హీటర్ వేసుకుని ఆ నీటితో స్నానం చేసేది. ఎప్పటిలాగే జనవరి 3వ తేదీ స్నానానికి వెళ్ళిన ఆమె హీటర్ తీస్తున్న క్రమంలో కరెంట్ షాక్ కు గురైంది. దీంతో బాత్రూంలోనే స్పృహ కోల్పోయి పడిపోయింది.

స్నానానికని వెళ్ళిన అమ్మాయి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో తన కూతురు వెళ్లి తన తల్లిని పిలిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ కూతురు వేళ్లి నాన్నను పిలుచుకోచ్చింది. వారి అత్త కూడా తనని పిలుస్తూ ఉన్నప్పటికీ ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి వారి సహాయంతో బాత్రూమ్ డోరు ఓపెన్ చేశారు.అయితే ఆమె స్పృహ కోల్పోయి పడిపోవడంతో కరెంట్ షాక్ కొట్టినట్లు భావించి మొత్తం కరెంట్ లేకుండా చేసి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఐదు సంవత్సరాల కూతురు అమ్మ లే అమ్మ అంటూ తన తల్లిని లేపే ప్రయత్నం చేయడంతో ఆ ఘటన అక్కడ అందరిని కంటతడి పెట్టిస్తుంది.