టిఫిన్‌ ఇవ్వలేదని కోడలని తుపాకీతో కాల్చి చంపిన మామ!

ఓ వ్యక్తి కోడలిపై దారుణానికి పాల్పడ్డాడు. చాయ్‌ (టీ)తో పాటు అల్పాహారం ఇవ్వలేదని ఏకంగా తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన థానేలో గురువారం చోటుచేసుకుంది.  కాశీనాథ్‌ పాండురంగ్‌ పాటిల్‌ (76)కు ఆయన కోడలు టీ అందించింది. అయితే, టీతో పాటు టిఫిన్‌ కూడా ఇవ్వాలి కదా ? అంటూ రెచ్చిపోయి తుపాకితో కాల్చాడు. దీంతో త్రీవంగా గాయపడిిన ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్చగా.. చికిత్స పోందుతూ  మృతి చెందింది.  కాశీనాథ్‌పై కేసు నమోదు చేశామని.. ఘటనకు సంబంధించి మరేదైన కారణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని  థానే సీనియర్‌ పోలీస్‌ అధికారి సంతోష్‌ ఘటేకర్‌ తెలిపారు.