అక్కడ పచ్చిమిర్చి రూపంలో దర్శనమిస్తున్న వినాయకుడు.. గణపతి బప్పా మోరియా

lord ganapathi visits woman house in the guisy of green chilli

వినాయక చవితిని ఒక్క భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఏ దేవుడికీ చేయనట్టుగా.. గణేశ్ చతుర్థి రోజున గణపతి పత్రిమను ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన తర్వాత ఆ గణనాథుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు.

lord ganapathi visits woman house in the guisy of green chilli
lord ganapathi visits woman house in the guisy of green chilli

ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా వినాయక చవితిని అందరూ చేసుకునేవాళ్లు. కానీ.. ఈ సంవత్సరం మాత్రం ఎవరి ఇంట్లో వాళ్లే చేసుకోవాలి. ఎందుకో మీకు కూడా తెలుసు. ఈ మాయదారి కరోనా వచ్చి బతుకులన్నీ ఇలా మారిపోయాయి.

ఇక.. అసలు విషయానికి వద్దాం.. అందరూ గణనాథులను కొనుక్కొని తీసుకొని వస్తే.. ఓ మహిళకు మాత్రం గణనాథుడే తన ఇంటికి వచ్చాడు. కానీ.. పచ్చి మిర్చి రూపంలో.

ఓ మహిళ కూరగాయలు కొనడానికి మార్కెట్ కు వెళ్లింది. అన్ని కూరగాయలు కొనుక్కున్నది. చివరకు పచ్చిమిర్చిని కూడా కొనుక్కున్నది. ఇంటికి వచ్చాక పచ్చిమిర్చిని ఏరుతుంటే అచ్చం గణపతి ఆకారంలో ఉన్న ఓ పచ్చిమిర్చి కనిపించింది.

అసలే వినాయక చవితి.. పచ్చిమిర్చి చూస్తే అచ్చం వినాయకుడిలా ఉంది… దీంతో ఎంతో మురిసిపోయిన ఆ మహిళ… ఆ పచ్చిమిర్చి వినాయకుడిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

స్వామి దగ్గరికి నువ్వు వెళ్లలేకపోతే… నీ దగ్గరికే ఆయన వస్తాడు. ఒక్కోసారి పచ్చిమిర్చి రూపంలో కూడా రావచ్చు.. అంటూ క్యాప్సన్ పెట్టి.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అంతే.. ఇవాళ అసలే వినాయక చవితి.. ఇక ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక.. ఆ మహిళ పెట్టిన పచ్చిమిర్చి వినాయకుడిని చూసిన నెటిజన్లు.. వినాయకుడిని మట్టిరూపంలోనే పూజించాల్సిన పనిలేదు. ఎలాగైనా పూజించవచ్చు. పచ్చిమిర్చి రూపంలో ఉన్నా పూజించొచ్చు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.