లాక్ డౌన్ ఎఫెక్ట్: సినీ తార‌ల‌ వ్య‌భిచారం

హీరో ఫామ్‌హౌస్‌లో బ్యాడ్‌గాళ్ వారంపాటు లాక్డ్

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో లాక్ డౌన్ తో ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డారో తెలిసిందే. దాదాపు మూడు నెల‌లు పాటు అన్నిర‌కాలుగాను ఇబ్బంది ప‌డాల్సిన స‌న్నివేశం. ఇంటికే ప‌రిమిత‌వ్వాల్ని ప‌రిస్థితి. కంటింకి క‌నిపించ‌ని వైర‌స్ దేశ ఆర్ధిక వ్య‌వ్య‌స్థ‌నే అస్త‌వ్య‌స్తం చేసింది. అన్ని రంగాల‌పై ఆర్ధికంగా తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది. కూలి ప‌నులు కూడా చేసుకునే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతం ఐదవ ద‌శ లాక్ డౌన్ అమ‌లులో ఉంది. అదీ ఈనెల 30 తో ముగుస్తుంది. ఇప్ప‌టికే ఆంక్ష‌ల్ని దాదాపు ఎత్తేసారు. జూన్ 30 త‌ర్వాత దేశంలో ఎలాంటి లాక్ డౌన్ ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఆపై ఎవ‌రి జాగ్ర‌త్త‌లు వారే పాటించి క‌రోనాని నియంత్రిచాల్సి ఉంటుంది.

అయితే ఈమూడు నెల‌ల క‌రోనా స‌మ‌యంలో సినిమా ఇండ‌స్ర్టీ నుంచి పెద్ద ఎత్తున వ్య‌భిచారం జ‌రిగిన‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. టాలీవుడ్, కోలీవుడ్ లో కొంత మంది న‌టీమ‌ణులు, టీవీ ఆర్టిస్టులు వ్య‌భిచారానికి పాల్ప‌డిన‌ట్లు గ‌ట్టు ర‌ట్టు అయింది. త‌మిళ‌నాడు, పాండిచ్చేరి రాష్ర్టాలు అడ్డ‌గా భారీ ఎత్తున వ్య‌భిచారం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కోట్ల రూపాయ‌లు చేతులు మారిన‌ట్లు తెలిసింది. మార్చి 21 తోజ‌న‌తా క‌ర్ఫ్యూతో ఎక్క‌డి జ‌నం అక్క‌డే లాక్ అయ్యారు. స‌రిగ్గా రెండు నెల‌లు పాటు ఎటు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి అయితే ఉంది. అయితే ఇదే స‌మ‌యాన్ని అదునుగా చేసుకుని వ్య‌భిచార ముఠాలు, బ్రోక‌ర్లు పెద్ద ఎత్తున అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌టికే వివిధ హోట‌ళ్లు, రెస్టారెంట్లు, స్పా సెంట‌ర్ల‌లో కొంత మంది సెల‌బ్రిటీలు లాక్ అవ్వ‌డంతో గ‌ట్టు చ‌ప్పుడు కాకుండా స‌ద‌రు యాజ‌మాన్యాలు డ‌బ్బున్న బ‌డా బాబుల్ని, అమ్మాయిలంటే పిచ్చిగా భావించే యువ‌త‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలిసింది.

త‌మ హోట‌ళ్ల‌లో అమ్మాయిలున్నారని పిలిపించి వ్య‌భిచారం చేసిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రెండు నెల‌ల కాలం పాటు ఈ తంతు జ‌రిగ‌న‌ట్లు స‌మాచారం. పాండిచ్చేరిలో పేరొందిన వ్యాపార వేత్త చంద్రూజీ అనే వక్తి ఇద్దరు కోలీవుడ్ హీరోయిన్ల‌ను బుక్ చేసుకున్న విష‌యంలో వెలుగు రావ‌డంతో…పోలీసులు ఢొంకంతా క‌ద‌ప‌డంతోనే ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సొంత గెస్ట్ హౌస్ లోనే చంద్రూజీ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోవ‌డం షాకింగ్ కి గురిచేస్తోంది. దీంతో మ‌సాజ్ సెంటర్లు, స్పా సెంట‌ర్లు, స‌ముద్ర తీరం వెంబ‌డి ఉన్న రిసార్స్ట్ లో పోలీసులు రైడ్ నిర్వ‌హించ‌డంతో ఈ వ్య‌భిచార ముఠా గుట్టు ర‌ట్టు అయింది. ఈ రైడ్ లో యవ‌ న‌టీమ‌ణులు, సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్లు పోషించే వాళ్లు, బుల్లి తెర న‌టీమ‌ణులు పెద్ద ఎత్తున ప‌ట్టుబ‌డ్డ‌ట్లు స‌మాచారం. అయితే పోలీసులు ఆ వివారాలు మాత్రం గోప్యంగా ఉంచారు.