మలయాళ భారీ హిట్..మైండ్ బ్లాకింగ్ చిత్రం “దృశ్యం 3” పై బిగ్ అప్డేట్..!

అసలు ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ పర్వం హిట్ అవ్వదు అనుకునే వారికీ అలాగే ఈ సీక్వెల్స్ లో డెఫినెట్ గా ఒక మైండ్ బ్లాకింగ్ పర్ఫెక్ట్ సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది కూడా ఇండియన్ సినిమా దగ్గర ది బెస్ట్ సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది “దృశ్యం” సిరీస్ నే సినీ విమర్శకులు చెబుతారు.

తెలుగులో మన వెంకీ మామ తీసినా ఒరిజినల్ గా ఈ చిత్రం మలయాళంకి చెందిన సినిమా. అక్కడ బిగ్ స్టార్ మోహన్ లాల్ మరియు దర్శకుడు జీతూ జోసెఫ్ ల కాంబోలో వచ్చిన ఈ రెండు సినిమాలు అక్కడ సెన్సేషనల్ హిట్ లు. పార్ట్ 1 నే ఓ రేంజ్ లో అనుకుంటే ఇక “దృశ్యం 2” కి ఇచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియెన్స్ కి ఫ్యుజ్ లు ఎగిరిపోయాయి.

ఇక దీనితో పాటుగా “దృశ్యం 3” కూడా ఉందని అప్పుడు తెలపడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే లేటెస్ట్ గా మాత్రం ఈ సినిమా మూడో భాగంపై ఓ బిగ్ అప్డేట్ మంచి వైరల్ గా మారింది. దీనిపై ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కనిపిస్తుంది.

దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని మూడో భాగంతో ఆపుతున్నట్టుగా “దృశ్యం 3 ది కంక్లూజన్” ఇస్తున్నట్టుగా హీరో మోహన్ లాల్ పై కొత్త పోస్టర్ వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమాపై ముందు రోజుల్లో మరిన్ని అధికారిక అప్డేట్ రాబోతున్నట్టుగా మాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా గాని థియేటర్స్ లో రిలీజ్ అయితే మాలీవుడ్ లో రికార్డు బ్రేకింగ్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలుస్తుంది అని వారు అంటున్నారు.