Aghori: లేడీ అఘోరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారారు. ఈమె ఇటీవల అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అగోరిగా ఉన్నటువంటి ఈమె ఓ మహిళా నిర్మాతను ప్రత్యేకంగా పూజలు చేస్తానని చెప్పి ఆమె నుంచి పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే విషయంపై మహిళా నిర్మాత మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉత్తరప్రదేశ్లో దాక్కొని ఉన్నటువంటి అఘోరిని అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు.
ముందుగా ఈమెను అరెస్టు చేసిన పోలీసులు కంది సబ్ జైలుకు తరలించారు అయితే అక్కడ ఏ బారక్ లో ఉంచాలో తెలియక కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలనే తెలిపింది. దీంతో ఈమె ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో చంచల్గూడా జైలుకు తరలించారు. ఇలా 14 రోజులపాటు లేడీ అగోరికి రిమాండ్ విధించారు.
ఇలా ఈమెను చంచల్గూడా జైలుకు తరలించడంతో తనతో పాటు తన వర్షిని కూడా జైలులోనే ఉండాలి అంటూ పెద్ద ఎత్తున పోలీసులకు చుక్కలు చూపించారు. ఇక అఘోరి అరెస్ట్ కావడంతో తన మొదటి భార్య అంటూ బయటకు వచ్చిన రాధిక మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఘోరిని అరెస్టు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అయితే తనకి మరింత శిక్ష పడితే పూర్తిగా సంతోషిస్తానని వెల్లడించారు.
అఘోరికి ఉరిశిక్ష సరైన శిక్ష అని తెలిపారు. తనకు ఉరిశిక్ష పడితే ముందుగా సంతోషించేది తానేనని వెల్లడించారు. తనకు భయంకరమైన వశీకరణ శక్తులు ఉన్నాయి తన మాటలతో ఎవరినైనా కూడా తన వశం చేసుకుంటారు. అగోరి బాధితులు చాలామంది ఉన్నారని కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా మగవారు కూడా తన బాధితులుగా ఉన్నారని రాధిక వెల్లడించారు. అఘోరి వద్ద వశీకరణ శక్తి ఉందని నేను తన వద్ద ఉన్నప్పుడు ఎవరి మాటలు నమ్మేదాన్ని కాదు తన మాటే వినేదాన్ని అంటూ రాధిక ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.