Lady Aghori: లేడీ అఘోరి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే ఈమెపై లేడీ నిర్మాత మోకిలా పోలీస్ స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూజ చేస్తానంటూ తనని బెదిరించి పది లక్షల రూపాయలు మోసం చేసింది అంటూ నిర్మాత చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు లేడీ అఘోరిని అరెస్టు చేశారు.అఘోరీతో పాటు అతని భార్య శ్రీ వర్షిణితో కారులో హరిద్వార్ వెళుతుండగా మోకిలా పోలీసులు పక్కా ప్రణాళికతో ఉత్తర ప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ లో మంగళవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఇలా పోలీసు కస్టడీలోకి అగోరి వెళ్లడంతో తనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం చేవెళ్ల ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ఎదుట అఘోరీని హాజరుపరిచారు. న్యాయమూర్తి అగోరిని 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ క్రమంలోనే అఘోరిని సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తనను తరలించారు..అయితే అక్కడ ఆమెను ఆడవారి బారక్ లో ఉంచాలా లేదా మగవారి బారక్ లో ఉంచాల అర్థం కాక పోలీసులు తిరిగి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు.
వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్ జెండర్ అని తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు నగరంలోని చంచల్గూడా జైలుకు తరలించినట్లు సమాచారం. అగోరిని అరెస్టు చేయడంతో తన భార్య శ్రీ వర్షిణి తన తల్లిదండ్రులతో వెళ్లడానికి నిరాకరించడంతో ఆమెను పోలీసులు నగరంలోని హైదర్ షాక్ హోటల్ లోని కస్తూర్బా గాంధీ హోంకు తరలించారని తెలుస్తోంది. అయితే తన భార్య తన తో పాటు ఉండాలి అంటూ అఘోరీ పోలీసులను కోరడమే కాకుండా ఈ కేసు విషయంలో పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.