యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో అనేది అభిమానుల్లో ఇన్నాళ్లు మెదులుతూ వచ్చిన పెద్ద ప్రశ్న. నిన్నమొన్నటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినబడినా ఇప్పుడు మాత్రం కొరటాల శివ పేరు ఖాయమైంది. ప్రజెంట్ కొరటాల ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యే నాటికి తారక్ ‘ఆర్ఆర్ఆర్’ ముగించుకుంటారు. ఇద్దరూ ఒకేసారి ఖాళీ అవుతారు. కాబట్టి కొత్త సినిమా మొదలుపెట్టడానికి ఇద్దరికీ అదే మంచి సమయం అవుతుంది. ప్రజెంట్ కోవిడ్ బ్రేక్ తీసుకుని ఉన్న కొరటాల తారక్ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు.
ఒకవైపు స్క్రిప్ట్ పనులు చేస్తూనే మరోవైపు హీరోయిన్ కోసం వెనుకుతున్నారు. తాజా సమాచారం మేరకు ఆయన కైరా అద్వానీని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కైరా అద్వానీ గతంలో కొరటాల చేసిన ‘భరత్ అనే నేను’ సినిమాలో కథానాయకిగా నటించి మెప్పించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే కొరటాల తారక్ సినిమాలో ఆమెనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే చర్చలు ముగిశాయని, కైరా సైతం కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఫిల్మ్ నగర్ టాక్.