NTR Show: ఆ స్టార్ హీరోను చూస్తుంటే అసూయ వేస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్!

NTR Show: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెరపై వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం చివరి ఎపిసోడ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరయ్యారు. ఇలా ఇద్దరం హీరోలు ఒకే వేదికపై ఉండడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మహేష్ బాబు సాధారణంగా ఆహ్వానించి తనని హాట్ సీట్లు కూర్చోబెట్టారు. ఇక ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ పలు ప్రశ్నలు వేయడంతో మహేష్ బాబు ఎంతో చాకచక్యంగా సమాధానం చెబుతూ ఈ కార్యక్రమంలో 25 లక్షల గెలుచుకున్నారు.

ఇక ఈ కార్యక్రమం మొదలు ఎన్టీఆర్ మహేష్ బాబు వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించారు. మహేష్ బాబు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతి మూడు నెలలకు ఒకసారి తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళుతూ తన సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు. ఇదే విషయాన్ని తారక్ అడగడంతో అలా వెళ్ళినప్పుడు తన కుటుంబంతో తనకు మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడుతుందని మహేష్ బాబు తెలిపారు. అలాగే మహేష్ బాబు కూతురు సితారతో తనకున్న అనుబంధం గురించి ఎన్టీఆర్ అడిగారు.

ఈ సందర్భంగా సితార గురించి మహేష్ బాబు మాట్లాడుతూ.. తనతో గడిపిన ప్రతిక్షణం తనకు ఎంతో అద్భుతంగా ఉంటుందని మహేష్ బాబు తెలిపారు. ఇక ప్రతి సంవత్సరం తనతో తనకు ఎంతో మంచి అనుబంధం ఏర్పడుతోందని మహేష్ బాబు తన కూతురు గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈ మాటలు విన్న ఎన్టీఆర్ మహేష్ బయ్యా మిమ్మల్ని చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. ఎవరైనా కూతుర్లు గురించి ఇలా గొప్పగా చెబితే నాకు కూతురు లేరు అనే వెలితి ఉందని ఎన్టీఆర్ చెప్పారు.ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు కావడంతో తనకు కూతురు లేని వెలితే పూర్తిగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.