‘మా’ ఎన్నికల బరిలోకి లేడీ..రసవత్తరంగా మారిన పోటీ

Jeevitha Rajasekhar to contest in Maa elections
Jeevitha Rajasekhar to contest in Maa elections
మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.  ఎప్పుడో సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుండే ఇండస్ట్రీని తాకుతోంది. బలమైన వ్యక్తులు బరిలోకో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఆయనకు పోటీగా మంచు విష్ణు బరిలో నిలుస్తున్నట్టు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.
 
విష్ణు ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం గట్టిగా చేస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజు లాంటి వారిని కలుస్తూ మద్దతు కూడదీసుకుంటున్నారట. దీంతో విజయం ఆయన వైపే అనుకుంటున్నారు అంతా.
 
అయితే తాజాగా పోటీలోకి జీవితా రాజశేఖర్ కూడ దిగుతున్నట్టు తెలుస్తోంది. జీవితా ప్రస్తుతం మా అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నారు.  ఆమెకు కూడ అధ్యక్ష పదవి చేపట్టాలనే కోరిక బలంగా ఉంది.  అందుకే తనకు మద్దతుగా నిలిచే ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారట. జీవిత రాకతో పోటీ మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కార్యావర్గంలో ఆమెకు కూడ సన్నిహితులు ఉన్నారు.  సో.. ఆమె పోటీని తేలికగా తీసుకోవడం కుదరదు.  మరి నువ్వా నేనా అన్నట్టు జరగబోయే ఈ ఎన్నికల్లో చివరికి ఎవరు గెలుస్తారో చూడాలి.