మంత్రుల బస్సు యాత్రలో ప్రజలు రాళ్లు విసురుతారేమో అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా వైకాపా ప్రభుత్వం గురించి కొన్ని విమర్శలు చేశాడు. ఆ ప్రభుత్వ అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని అన్నాడు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. మంత్రులు బస్సుయాత్రకు పోలీసు రక్షణ పెంచుకోవాలని.. ప్రజలు రాళ్లు విసురుతారేమో అని వెటకారం చేశాడు.

ఇక తమ పార్టీ నేత కాలవ శ్రీనివాసులను రాయదుర్గంలో ఆలయానికి కూడా వెళ్ళనియ్యరా ప్రశ్నించాడు. పోలీసులను అడ్డుపెట్టుకొని వైకాపా ఎమ్మెల్యేలు, నేతలు అరాచకాలు చేస్తున్నారని అన్నాడు. ఇక త్వరలో తను శ్రీనివాసులతో కలిసి రాయదుర్గం ఆలయానికి వెళ్తానని అన్నాడు.