Jabardasth Paradesi : ఆది గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్న జబర్దస్త్ పరదేశి తల్లి..!

Jabardasth Paradesi : బుల్లితెర మీద ఎన్నో కామెడీ షో లు ప్రసారం అవుతున్నప్పటికీ ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ని మాత్రం వెళ్లలేక పోతున్నాయి. జబర్థస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. జబర్థస్త్ షో ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. జబర్థస్త్ షో ద్వార గుర్తింపు పొందిన వారిలో పరదేశి కూడా ఒకరు. హైపర్ ఆది టీమ్ లో చేస్తున్న పరదేశి తన కామెడీతో గుర్తింపు పొందాడు.

ఇటీవల తన తల్లితో కలిసి శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కనిపించారు. గతంలో వైజాగ్ లో జరిగిన సంఘటన గురించి తలుచుకొని పరదేశి, తన తల్లి కన్నీరు పెట్టుకున్నారు. గతంలో జబర్థస్త్ దొరబాబు, పరదేశి ఇద్దరు వ్యభిచార గృహంలో దొరికిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ ఘటన గురించి అందరికీ తెలియటంతో వారిద్దరి ఇమేజ్ బాగ దెబ్బతినింది. అలా ఇద్దరు వ్యబిచార గృహంలో దొరకటంతో పోలిసులు అరెస్ట్ చేశారు. ఇలా పోలీస్ కేస్ అవ్వటంతో వారిద్దరి జీవితం అయిపోయిందని అందరు అనుకున్నారు.

కానీ ఆ సమయంలో హైపర్ ఆది మాత్రం వారికి తోడుగా ఉన్నాడు. తన పలుకుబడి ఉపయోగించి వారికి బయటకి తెచ్చాడు. అంతే కాకుండా మళ్ళీ వాళ్ళిద్దరికీ తన టీమ్ లో అవకాశం ఇచ్చి మరింత ఫేమస్ అయ్యేలా చేసాడు. ఇటీవల శ్రీదేవీ డ్రామా కంపెనీలో పాల్గొన్న పరదేశి, అతని తల్లీ ఆది చేసినా మేలు తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో పరదేశి మాట్లాడుతు నాన్న లేని నాకూ ఆది అన్న లాగా తోడుగా ఉన్నాడు. నాకూ మా అమ్మ, మ అన్న అంటూ తాను కూడ కన్నీరు పెట్టుకున్నాడు.