వేదికపై భార్య కాళ్ళు పట్టుకున్న కమెడియన్.. అసలేం జరిగిందంటే?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు ఎంతో మంది కుటుంబ సమేతంగా హాజరు అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రతివారం ప్రసారమయ్యే కార్యక్రమాలలో క్యాష్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు హాజరు అయ్యి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే క్యాష్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో భాగంగా పలువురు కమెడియన్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కమెడియన్ ఆనంద్, కొమరం, సత్తిపండు, శాంతి కుమార్ వారి భార్యలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే సుమ వీరి చేత పలు టాస్క్ లు నిర్వహిస్తూ ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈ ప్రోమోలో భాగంగా సుమ సత్తిపండు భార్య నాగామాంబాను ప్రశ్నిస్తూ మీ ఆయనను వంద కోట్లకు అమ్మేస్తావా అని అడగగా మా ఆయన బంగారం నేను అమ్మనని చెబుతుంది.ఇలా ఈ మాట అనడంతో వెంటనే ఆనంద్ బంగారం అంతా మీ మెడలో వేసుకొని మా ఆయన బంగారం అంటారేంటి అంటూ సెటైర్ వేశారు.

YouTube video player

ఇకపోతే తరువాత కొమరం తన భార్య తనకు వీపు గోకాలని చెప్పగా గోకుతుంది. అలాగే కాళ్లు వత్తాలని చెప్పగా కాళ్ళు వత్తుతుంది.ఈ సందర్భంగా కొమరం మాట్లాడుతూ పెళ్లయిన 13 సంవత్సరాలకు సుమక్క పుణ్యమా అని ఇలా కాళ్లు పట్టించుకున్నానని చెబుతాడు. ఇక ఆనంద్ తన భార్య మంజులను కూడా కాళ్ళు వత్తాలి అని కోరగా ఆమె తన వంక చాలా కోపంగా చూస్తోంది. అనంతరం మంజులను కుర్చీలో కూర్చోబెట్టి వేదికపైనే ఆనంద్ తన భార్య కాళ్లను పట్టుకొని ఒత్తాడు. మొత్తానికి వేదికపై తన భార్య కాళ్ళు పట్టుకోవడం ఈ ప్రోమోకి హైలెట్ గా మారింది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే శనివారం వరకు వేచి చూడాలి.