ఈ టాలీవుడ్ హీరో మరో ఉదయ్ కిరణ్ అవబోతున్నాడా?

టాలీవుడ్ లో 2000 సంవత్సరం తో ఒక సరికొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. కాలేజీ బ్యాక్డ్రాప్ లో లవ్ స్టోరీస్ చాలా మొదలయ్యాయి. ‘చిత్రం’ సినిమాతో పరిచయం అయ్యి, ఆ తర్వాత ‘నువ్వు నేను’ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరో గా మారిపోయాడు ఉదయ్ కిరణ్. ఒకానొక టైం లో మహేష్ బాబు, ఎన్టీఆర్ కంటే ఉదయ్ కిరణ్ కే ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఉదయ్ కిరణ్ కెరీర్ లో డౌనఫాల్ స్టార్ట్ అయ్యింది. చివరికి కనీసం సినిమాలు కూడా లేక, నిరాశతో ఆత్మ హత్య చేసుకున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ హీరో మరో ఉదయ్ కిరణ్ అవుతాడని జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పాడు.  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ అరవింద్ స్వామి, ఓ ఉదయ్ కిరణ్ లాగా ఓ విజయ్ దేవరకొండ అని చెప్పారు. విజయ్ ని ఎవ్వరూ వెనుకకు లాగావలసిన పనిలేదు అని, అతను ఏమీ అంత పెద్దవాడు కాదు అని చెప్పారు. తన కెరియర్లో చెడు రోజులు మొదలయ్యాయి అని కూడా చెప్పారు. అతను సినిమా ఇండస్ట్రీలోకి ఎంత వేగంగా వచ్చాడో, అంతే వేగంతో వెనుకకు వెళ్ళిపోతాడు అని భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు వేణు స్వామి.

ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమాలు సక్సెస్ సాధించడం లేదు, ‘నోటా’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘డియర్ కామ్రాడ్’ సినిమాలు భారీగా నిరాశపరిచాయి. భారీ హైప్ తో వచ్చిన ‘లైగర్’ సినిమా కూడా భారీ డిసాస్టర్ అయ్యింది. ఈ సినిమా స్టార్ట్ ఐనప్పటినుండి  విజయ్ దేవరకొండ ని పూరి జగన్నాథ్  పొగుడుతూనే వస్తున్నాడు. మా సినిమా ముందు బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు అసలు సినిమాలే కాదన్నట్లు వ్యవహరించారు

ఈ సినిమా ఘోరం గా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు అందరూ విజయ్, పూరి ని ట్రోల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ వ్యవహరించిన తీరును కూడా తప్పు పడ్తున్నారు.

మరి వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు నిజం అవుతాయో లేదో తెలియదు కానీ విజయ్ దేవరకొండ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.