తేజు సిద్దంగానే ఉన్నాడా.? నిజమెంత.!

వినాయక చవితి రోజున అనూహ్యంగా రోడ్ యాక్సిడెంట్‌కి గురైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ దాదాపు రెండు నెలల తర్వాత కోలుకుని, పబ్లిక్‌లోకి వచ్చాడు. చిన్న దెబ్బలే అన్నారు కానీ, నెల రోజులు ఆసుపత్రి చికిత్స, మరో నెల రోజులు ఇంటి వద్ద చికిత్స తీసుకున్న తేజు దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కి దర్శన భాగ్యం కల్పించాడు.

ఫోటోలకు నవ్వుతూ పోజిచ్చి, పూర్తి ఆరోగ్యంగా కనిపించాడు తేజు. దాంతో హమ్మయ్యా.. మా అభిమాన హీరో బాగానే ఉన్నాడు.. అని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తేజు స్టేటస్ చూసిన ఫ్యాన్స్ ఇక త్వరలోనే షూటింగ్ హాజరవుతాడు.. కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసేస్తాడులే అనుకుంటున్నారు.

కానీ, మరో కొద్ది రోజులు తేజుకు రెస్ట్ అవసరమట. ఫిట్‌గా కనిపిస్తున్నప్పటికీ రిస్కీ స్టంట్స్, డాన్సులు చేయడానికి ఇంకా కాస్త టైమ్ పడుతుందని వైద్యులు సూచించారట. సో ఇప్పుడప్పుడే తేజు షూటింగులకు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. యాక్సిడెంట్ కారణంగా ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడే తేజు హీరోగా తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా ధియేటర్లో సందడి చేసిన సంగతి తెలిసిందే.