పవన్ కళ్యాణ్ సినిమాలో పాయల్ కి ఆఫర్ అంటే బద్దలైపోయినట్టే ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటే ఆ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు సీన్స్ లో కనిపించి ఒక పాట లో కాలు కదిపినా చాలు అనుకునే హిరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ లో కూడా శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది. ఈ సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ తో పాటు ఒక సాంగ్ లో మాత్రమే శృతి కనిపించే అవకాశం ఉన్నప్పటికి పవర్ స్టార్ తో గతంలో గబ్బర్ సింగ్ అన్న సినిమాలో నటించినది కాబట్టి ఒప్పుకుందట. అంతేకాదు ఈ సినిమాలో పవర్ స్టార్ ఛాన్స్ ఇవ్వడం వల్లే శృతి హాసన్ కి అప్పటి వరకు ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ బద్దలైపోయింది.

Tollywood: Pawan Kalyan wants to remake this Malayalam film in Telugu

కాగా వకీల్ సాబ్ తర్వాత మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం రీమేక్ లో పవర్ స్టార్ నటించబోతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు జరుగుతున్నాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో పవర్‌స్టార్ బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనుండగా మరో పాత్ర పృథ్వి రాజ్ పాత్ర ఎంపిక జరగాల్సి ఉంది. అయితే ఈ పాత్ర కోసం ప్రముఖంగా రానా దగ్గుబాటి పేరు వినిపిస్తోంది. అంతేకాదు తాజా గా మరో న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆర్ ఎక్స్ 100 తో ఫేం తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జంటగా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఇంతకు ముందు పాయల్ వెంకటేష్, రవితేజ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం అనగనగా ఓ అతిథి అన్న సినిమాలో డీ గ్లామర్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమా ఆహా లో రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పుడు అయ్యప్పనం కోషియం లో నటిస్తుందన్న వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇదే నిజమైతే టాలీవుడ్ లో ఇక పాయల్ సెటిలైపోయినట్టే అంటున్నారు.