తనని ఇన్సల్ట్ చేసిన మోడీ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్న కే‌సి‌ఆర్ ?

cm kcr pm modi

 సీఎం కేసీఆర్ కు రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వటం బాగా ఇష్టమైన పని, అసలు కేసీఆర్ మూలంగానే రాజకీయాల్లో రిటర్న్ గిఫ్ట్ అనే పదం వాడుకలోకి వచ్చిందని చెప్పాలి. 2018 ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ తనకు గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు కు ఆంధ్రాలో తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పటంతో అప్పటి నుండి రిటర్న్ గిఫ్ట్ బాగా ఫేమస్ అయ్యిపోయింది. ఇక ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ ప్రధాని మోడీకి ఇవ్వబోతున్నట్లు తెరాస పార్టీ నేతలు చెపుతున్నారు.

cm kcr pm modi

 గ్రేటర్ లో తెరాస-బీజేపీ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల పోరాటం చేస్తున్నాయి, ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ పరిశీలనకు వచ్చారు, శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది. కానీ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పారట. దీంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అవాక్కయ్యింది.

అయితే దీనిని తెరాస పార్టీ రాజకీయంగా వాడుకోబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధాని అధికారిక పర్యటనకు రాష్ట్ర సీఎంను రావొద్దని చెప్పడం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టిన ఢిల్లీ పెద్దలకు తగిన బుద్ది చెబుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు. ఆనాడు సీఎం అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించినట్లు ఈనాడు కేసీఆర్ ను మోదీ అవమానిస్తున్నారని విమర్శించారు. దీనితో తెరాస నేతలందరూ దీనినే హైలైట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు, కేసీఆర్ ను అవమానించిన మోడీకి గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీ ఘనవిజయం సాధించి బీజేపీ కి రిటర్న్ ఇవ్వబోతున్నట్లు తెరాస నేతలు చెపుతున్నారు.