ఇలాంటి టైం లో నాని కలకత్తా వెల్లడం అవసరమా ..?

నేచురల్ స్టార్ నాని టాక్సీ వాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి, ఉప్పెన ఫేం కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కతోంది. అంతేకాదు ఈ సినిమా ఎక్కువ భాగం కలకత్తా బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు రాహుల్ సంకృత్యన్. అయితే ప్రస్తుతం కరోనా నెలకొన్న కారణంగా హైదరాబాద్ శివారుల్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ని నిర్మించి షూటింగ్ జరపుతున్నారట.

Shyam Singha Roy: Nani, Sai Pallavi, Krithi Shetty To Play Lead Roles! Film  To Go On Floors In December

కాగా ఈ సెట్ లో ప్రస్తుతం టైటిల్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. నాని మీదే షూట్ చేస్తున్న ఈ టైటిల్ సాంగ్ కంప్లీటవడానికి ఇంకో 3 – 4 రోజులు పడుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో సాంగ్ తో పాటు ఇంటర్వెల్ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ చేయనున్నారట. ఇక ఇప్పటికే శివ నిర్వాణ తో టక్ జగదీష్ అన్న సినిమా కూడా కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు నాని. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తుండగా డిసెంబర్ లోపు షూటింగ్ కంప్లీటవుతుందని సమాచారం.

ఈ రెండు సినిమాల తర్వాత నాని తన 28 వ గా ‘అంటే.. సుందరానికీ’ అన్న వెరైటీ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాని ప్రకటించిన మేకర్స్ తాజాగా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహాద్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. ఇక ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 2021 లో ఈ సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.