సమంత కాపురంలో చిచ్చు పెట్టిన ఉప్పెన బ్యూటీ…. అసలేమైందంటే?

సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత ఆ సినిమా మంచి హిట్ అవడంతో ఇటు తెలుగు అటు తమిళ్ భాషలలో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇలా గ్లామర్ పాత్రలలో మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.

అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని ఒకరికి ఒకరు దూరం అయ్యారు. విడాకుల తర్వాత సమంత తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇలా తెలుగు తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా సమంత నటించిన యశోద సినిమా విడుదలై మంచి హిట్ అందుకుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత అనారోగ్యం కారణంగా ఆమె నటిస్తున్న సినిమాలకు బ్రేక్ పడింది.

ప్రస్తుతం తెలుగులో సమంత నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అలాగే ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ , సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమాలో వీరిద్దరూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఈ సినిమా గురించి తాజాగా మరొక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో సమంత తో పాటు కృతి శెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా నటించబోతునట్లు సమచారం. ఫుల్ టు ఫుల్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్యలో దూరి వాళ్లకు గొడవలు క్రియేట్ చేసే క్యారెక్టర్ లో కృతి నటిస్తున్నట్లు సమాచారం. ఇక… తన భర్తను కృతి మాయలో పడకుండా సమంత ఎలా కాపాడుకుంటుంది అనేదే ఈ సినిమా కథ.