బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

ప్రజలలో చాలామంది బ్రహ్మం గారి కాలజ్ఞానంను నమ్ముతారనే సంగతి తెలిసిందే. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని ప్రూవ్ కావడం గమనార్హం. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కాలజ్ఞానంలో ఉన్న విషయాలే కావడం గమనార్హం.

బ్రహ్మంగారు కాలజ్ఞానంలోని విషయాలను వేర్వేరు సందర్భాల్లో వెల్లడించడం గమనార్హం. 40 రోజుల పాటు కాశీలో ఉన్న దేవాలయం పాడుబడుతుందని బ్రహ్మంగారు చెప్పగా 1910 – 1912 సమయంలో ఆయన చెప్పిన విధంగానే జరగడం గమనార్హం. 16 సంవత్సరాల పాటు అంబ పాలిస్తుందని బ్రహ్మంగారు చెప్పగా పదహారు సంవత్సరాల పాటు ఇందిరా గాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.

బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పగా ప్రస్తుతం అదే విధంగా జరుగుతోంది. చిత్ర విచిత్రమైన యంత్రాలు అందుబాటులోకి వస్తాయని బ్రహ్మంగారు వెల్లడించారు. నీళ్లతో దీపాలను వెలిగిస్తారని బ్రహ్మంగారు చెప్పగా ప్రస్తుతం నీళ్లతోనే కరెంట్ ఉత్పత్తి జరుగుతోందనే సంగతి తెలిసిందే. బ్రహ్మంగారు కపట యోగులు విపరీతంగా పెరుగుతారని చెప్పగా ప్రస్తుతం దేశంలో దొంగ బాబాలు ఎక్కువయ్యారనే సంగతి తెలిసిందే.

మనుషులు వావీవరసలను మరిచిపోయి మృగాలలా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. బ్రహ్మంగారి కాలజ్ఞానానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కొండ గుహలలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయగా ప్రస్తుతం ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయాలలో చాలా విషయాలు ఇప్పటికీ జరగలేదు. అయితే రాబోయే కాలంలో ఆయన చెప్పిన ప్రతి విషయం తప్పనిసరిగా జరుగుతుందని ఆయనను నమ్మే భక్తులు భావిస్తుండటం గమనార్హం.