Tollywood Producers : ఇన్సైడ్ టాక్ : జగన్ కి షాకివ్వబోతున్న టాలీవుడ్ నిర్మాతలు..?

Tollywood Producers :ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దేశమంతా కూడా ఒకలా టికెట్ రేట్లు ఉంటే ఒక్క ఏపీలో మాత్రమే ఒకరకంగా పోకడ ఉందని ఇలా అయితే సినిమా థియేటర్స్ పెద్ద సినిమాలకు కూడా దెబ్బ పడుతుంది అని పెద్ద పెద్ద నిర్మాతలు వాపోతున్నారు.

మరి ఇప్పటికే అనేక సార్లు ఏపీ మంత్రులు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ దృష్టికి కూడా ఈ సమస్యని తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి వంటి దిగ్గజం కూడా జగన్ కి లేఖ రాసిన ఎలాంటి స్పందన తనకి ఇవ్వలేదని ఓ అవార్డు ఫంక్షన్ లో చెప్పడం కూడా వైరల్ అయ్యింది.

ఇలా వారు ఎంత గగ్గోలు పెడుతున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం తెలుగు సినిమా విషయంలో కనికరించలేదు. దీనితో ఇప్పుడు ఒక ఊహించని టాక్ బయటకొచ్చి వైరల్ అవుతుంది. సినిమా టికెట్ ధరల విషయంలో టాలీవుడ్ నిర్మాతలు కోర్టుకి వెళ్లనున్నారని తెలుస్తుంది.

దీనిలో ఇంకా ఎంతవరకు అధికారిక క్లారిటీ లేదు కానీ తమకి ఎంత ప్రయత్నించినా సానుకూల స్పందన రాకపోవడంతో వారు ఇక న్యాయ స్థానాన్ని ఆశ్రయించనున్నారని ఇన్సైడ్ టాక్. ఎలాగో పక్క రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా కూడా ఒకటే రేట్లు ఉన్నాయి కాబట్టి కోర్టులో నిర్మాతలకు ఊరట లభించవచ్చు. మరి దీనిపై ఫైనల్ గా ఏమవుతుందో చూడాలి.