దేశంలో పెరిగిన యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో 26 మంది మృతి!

దేశాన్ని పట్టి పీడించిన కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ ముంచుకొస్తునే ఉంది. ఇప్పటికే గత 24 గంటల్లో కొత్తగా 3,962 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక 2,697 మంది ప్రాణాలతో బయటపడగా 26 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో మాత్రం 22,416 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,31,72,547 కేసులు నమోదు కాగా మొత్తం 4,26,25,454 మంది కోలుకున్నారు.

ఇక 5,24,677 మంది మృతిచెందగా.. రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. క్రియాశీల రేటు 0.95 శాతం, మరణాల రేటు 1.22 శాతం ఉన్నాయి. కాబట్టి దేశంలో మళ్లీ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ప్రకటిస్తుంది.