Devotional Tips: ఇంటికి పట్టిన దరిద్రం పోవాలంటే ప్రతి రోజు గుమ్మం దగ్గర ఈ పని చేయాల్సిందే!

Devotional Tips: సాధారణంగా ప్రతి రోజూ మనం ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ మన చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలకుండా నిత్యం ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి. ఇలా ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పటికీ ఏదో ఒక రూపంలో డబ్బులు వృధాగా ఖర్చు కావడమే కాకుండా, లేనిపోని సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.ఈ విధంగా అనేక సమస్యలు మనల్ని వెంటాడుతుంది నేపథ్యంలో ఆ సమస్యల పరిహారం కోసం ఎన్నో మార్గాలు ఆలోచిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే ఇలా మన ఇంటికి పట్టిన దరిద్రం తొలగిపోవాలంటే ప్రతిరోజూ దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా మన ఇంట్లోకి సానుకూల ప్రభావం ఏర్పడాలన్న ప్రతికూల ప్రభావం ఏర్పడాలన్న ఇంటి ప్రధాన ద్వారం పై ఆధారపడి ఉంటుంది. ఇలా ఇంటి ప్రధాన ద్వారానికి నిత్యం శుభ్రంగా ఉంచడమే కాకుండా గడపకు పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవని ఇలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం గడ్డ పరిశుభ్రం చేసి రాగి చెంబులో నీటిని వేసి అందులో కొన్ని అక్షింతలు అలాగే ఎర్రటి పుష్పాలు, ఐదు కాయిన్స్, అలాగే వట్టి వేర్ల గుత్తి వేసి గుమ్మం లోపలి వైపు పెట్టాలి. ఇలా ప్రతిరోజు ఉదయం రాగిచెంబులో నీటిని మారుస్తూ ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పెరిగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది అలాగే గుమ్మం బయట వైపు ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.