ఢీ షోలో గబ్బు గబ్బు.. పాపం నవ్య స్వామి పరువు అంత తీసేస్తున్నారు!

బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ షోలలో ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో ఎంతో మంచి ప్రేక్షకాదణ పొందింది. గతకొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో ఇప్పటికే 13 సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు గా, కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకప్పుడు ఢీ షో అంటే కంటెస్టెంట్లందరూ అద్భుతమైన డాన్సులు చేస్తూ ఒకరితో ఒకరు పోటీపడేవారు. కానీ ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న ఢీ షోలో డాన్స్ కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. టాస్క్ ల పేరుతో షో నీ బ్రష్టు పట్టిస్తున్నారు.

ఢీ షో కి గణేష్ మాస్టర్, ప్రియమణి, నందిత శ్వేతా జడ్జ్ గా వ్యవరిస్తున్నారు. ఇక ప్రదీప్ యాంకరింగ్ చేయగా.. ఆది, నవ్య స్వామి, రవి క్రిష్ణ వంటి వారు కూడా ఢీ షో లో సందడి చేస్తున్నారు. అయితే నవ్య స్వామి, రవిక్రిష్ణ కలిసి ” ఆమె కథ” అనే సీరియల్ లో కలిసి నటించారు. అప్పటి నుండి వారిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉండటంతో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, తొందరలో వాళ్ళు పెళ్లి చేసుకుంటారని పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరి జోడీ చాలా ఫేమస్ అయ్యింది.

ఇక ఢీ షో లో ఒక పర్ఫార్మెన్స్ తర్వాత ఓడిపోయిన టీమ్ కి టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్ లో భాగంగా నవ్య స్వామిని రోబో లాగ యాక్ట్ చేయమని టాస్క్ ఇచ్చినప్పుడు ఆది మాట్లాడుతూ ..” ఆమె రోబోల నటిస్తుంటే 80 ఏళ్ల రోబో వాకింగ్ కి వచ్చినట్టు ఉంది” అని పంచ్ వేసి నవ్య స్వామి పరువు తీశాడు. ఢీ షోలో ఇలా టాస్క్ ల పేరుతో హద్దు మీరు మరి ప్రవర్తిస్తున్నారు. ఇది డాన్స్ షో నా? లేక ముద్దుల షో నా? అని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో రేటింగ్ పడిపోయింది అనటంలో సందేహం లేదు.