అయ్యో హైపర్ ఆది.. ఏమైంది నీకు.. ఎందుకబ్బా మళ్ళీ షో మిస్ అయ్యావ్?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అటువంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. అదిరే అభి టీం లో కంటెస్టెంట్ గా తన కెరీర్ ప్రారంభించిన హైపర్ ఆది కొంత కాలంలోనే తన ప్రతిభతో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆది కామెడీ టైమింగ్, వేసే పంచులతో జబర్దస్త్ ప్రేక్షకుల్లో జబర్దస్త్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పటంలో సందేహం లేదు. జబర్దస్త్ కి అంత మంచి గుర్తింపు వచ్చేలా చేసి ఆది గత కొన్ని వారాలుగా జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించటం లేదు. బుల్లి తెర మీద మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆది సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొంతకాలం జబర్దస్త్ లో కనిపించలేదని చాలా మంది అభిప్రాయపడ్డారు.

కానీ నెల రోజులు గడుస్తున్నా కూడా ఆది జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించకపోవటంతో ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. జబర్దస్త్ లో మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కొంత కాలంగా ఆది కనిపించటం లేదు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కామెడీ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కూడా ఆది కనిపించకపోవడంతో ప్రేక్షకులందరూ ఆది ఇక ఈ టీవీలో కనిపించడని కన్ఫామ్ చేసుకున్నారు. అందరి లాగే ఆది కూడా రెమ్యునరేషన్ పెంచమని అడిగితే మల్లెమాల వారు ఒప్పుకోక పోవటంతో ఆది ఈ టీవీలో షోస్ చేయటం మానేశాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మల్లెమాల వారు రెమ్యూనరేషన్ తక్కువ ఇస్తుండటంతో ఆది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, వంటి షోలు వదిలేసి మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ షో లో ఇప్పటికే జాయిన్ అయ్యాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఐదు సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారమైన పలు టీవీ షో లో సందడి చేసిన ఆది విషయంలో మల్లెమాల వారు ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఆది ఇలా నెలరోజులుగా ఈ టీవీ లో కనిపించకపోవటంతో ఈటీవీలో కాకపోయినా మరే ఇతర చానల్లో అయిన ఆది రావాలని ప్రేక్షకులందరూ కోరుకుంటున్నారు.