Crime: భార్యతో గొడవపడిన భర్త.. ఆవేశంలో గ్రైండర్ రాతితో భార్యపై దాడి.. అనంతరం తాను!

Crime: సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోవడం సర్వ సాధారణం అయింది. ఈ క్రమంలోనే గొడవ పడిన కొంత సమయానికి తిరిగి భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండటం మనం చూస్తుంటాము. అయితే కొందరు సరదాగా గొడవపడిన అది తీవ్ర వివాదానికి కారణమైన ఆవేశంలో కొన్నిసార్లు హత్యలు చేయడానికి కూడా పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటన చెన్నైలో ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రామనాథపురం జిల్లా ఏర్‌వాడి సమీపం అడంచేరి గ్రామానికి చెందిన మురుగన్‌, ముత్తులక్ష్మి దంపతులు నివసించేవారు. మురుగన్ వృత్తిపరంగా జాలరి. చేపలు పడుతూ జీవితం గడుపుతున్న వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉండేవారు. అయితే గత రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య ఓ చిన్న విషయమై గొడవకు దారి తీసింది. ఈ గొడవ క్రమక్రమంగా పెరిగి పెద్దది కావడంతో మురుగన్ ఆవేశంలో ఇంటిలో ఉన్న గ్రైండర్ రాయి తీసుకొని తన భార్య ముత్తులక్ష్మి పై దాడి చేశాడు.

దీంతో తీవ్ర రక్తస్రావమైన ముత్తులక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన భార్య మరణించిందనే విషయాన్ని తెలుసుకున్న మురుగన్ పోలీసులు తనని అరెస్ట్ చేస్తారనే భయంతో తానుకూడా ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే వీరు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసుకున్నారు.