తన మనువడు పేరు దుష్ప్రచారం చేశారు అంటూ ఫైర్ అయినా హోంమంత్రి..

తాజాగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహబూబ్ అలీ తన మనవడిపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించారు. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనలో తన మనవడు కూడా ఉన్నాడు అని దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. ఈ సామూహిక అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు.

ఇక ఈ కేసు గురించి రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని.. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి అని అన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల పై దాడులు జరగకుండా పటిష్టమైన చర్యలు కూడా తీసుకుంటుందని అన్నారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు అని అన్నారు.