Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టాయి అని చెప్పవచ్చు. ఇలా అల్లు అర్జున్ నటించిన సినిమాలలో ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
అలా వైకుంఠపురం: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $816K డాలర్లని వసూల్ చేసింది.
పుష్ప: అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడోసారి విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $530K డాలర్లని వసూల్ చేసింది.
సన్నాఫ్ సత్యమూర్తి: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సమంత అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్కడ ప్రీమియర్స్ తోనే $347K డాలర్లని వసూల్ చేసింది.
దువ్వాడ జగన్నాథం: హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పూజ హెగ్డే జంటగా నటించిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $305K డాలర్లని వసూల్ చేసింది.
నా పేరు సూర్య : వక్కంతం వంశీ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $207K డాలర్లని వసూల్ చేసింది.
సరైనోడు: బోయపాటి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ అల్లు అర్జున్ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $197K డాలర్లని వసూల్ చేసింది.
రేసుగుర్రం: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో శృతిహాసన్,అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే $102K డాలర్లని వసూల్ చేసింది.
జులాయి: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా ప్రీమియర్స్ తోనే $87K డాలర్లని వసూల్ చేసింది.
ఇద్దరమ్మాయిలతో: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా అక్కడ మాత్రం ప్రీమియర్స్ తోనే $80K డాలర్లని వసూల్ చేసింది.
బద్రీనాథ్: వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా అల్లు అర్జున్ సందడి చేశారు.
ప్రీమియర్స్ తోనే $57K డాలర్లని వసూల్ చేసింది.
