‘భీమ్లా నాయక్’ నే ఆమె కమాండ్ చేస్తుందట..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పవర్ ఫుల్ మల్టీస్టారర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. ఇందులో రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మాస్ లో భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి ఒకో అప్డేట్ రావడంతో మరిన్ని అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

అయితే ఈ సినిమాలో పవన్ సరసన యంగ్ హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపైనే ఆమె పలు ఆసక్తికర అంశాలు తెలియజేసింది. ఒరిజినల్ సినిమాలో కంటే ఇందులో తన పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందట.

అంతే కాకుండా తన పాత్ర భీమ్లా నాయక్ నే కమాండ్ చేసే విధంగా ఉంటుందని మరో ఇంట్రెస్టింగ్ డీటైలింగ్ కూడా బయట పెట్టింది. దీనిని బట్టి అలాంటి అగ్రెసివ్ భీమ్లా కూడా తన భార్య చెప్పే మాట వినక తప్పదని చెప్పాలి. మరి మొత్తంలో సినిమాలో వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి.