‘ ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్ ‘ మోడీ నుంచి జగన్ కి గ్రీన్ సిగ్నల్ ?

Cm jagan to meet pm modi at 10.30 am on October 6th

కేంద్రంలోని బీజేపీ చాలా తెలివిగా రాజకీయ చదరంగం ఆడుతోంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఎత్తులు వేయడంతో బీజేపీకి సరిసాటి ఎవరూ లేరు అని చెప్పాల్సిందే. మూడు రాజధానుల పై ఎటూతేల్చకుండా , సమయానుకూలంగా మాత్రం ప్రకటనలు చేస్తూ వస్తోంది. హై కోర్టులో విచారణ వేళ రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చిన కేంద్రం మరో వైపు ఏపీలో బీజేపీ నేతల చేత అమరావతే మన రాజధాని అనిపిస్తుంది.

cm jagan modi
cm jagan modi

జగన్ మూడు రాజధానుల విషయంలో బీజేపీని కూడా నెమ్మదిగా ఇరికించారు. అదెలాగంటే కర్నూలు లో హై కోర్టు ఏర్పాటు. అది బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ తో పాటు 2019 ఎన్నికల ప్రణాళికలో కూడా ఉంది. అయితే బీజేపీకి తానుగా అధికారంలోకి వస్తే ఆ హామీ నెరవేర్చడం వేరు. ఏపీలో జగన్ దాన్ని అమలు చేసి క్రెడిట్ కొట్టేయడం వేరు. మరి ఈ తేడాను అర్ధం చేసుకోలేని అమాయకత్వం బీజేపీకి లేదు. అందుకే ఆ పార్టీ గత ఏడాదిగా ఇదే విషయం నాన్చుతూ వస్తోంది.

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టుని కర్నూల్ కి తరలించడం అన్నది అతి ముఖ్యమైన అజెండా. మరి హై కోర్టు దీనికి అంగీకరించాలి. అంటే ప్రభుత్వం దీని మీద మాట్లాడి ఒప్పించాలి. ఇపుడు చూస్తే ఏపీ సర్కార్ అనేక జీవోలు హై కోర్టులో కొట్టివేతకు గురి అవుతున్నాయి. అదే సమయంలో హై కోర్టు మీద వైసీపీ నేతలు విమర్శలు చేసిన సందర్భం ఉంది. మరి అలాంటి వేళ సామరస్య భావనకు ప్రభుత్వం ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు. కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జగన్ ఆ తరువాత మళ్ళీ తన పనుల్లో తానున్నారు. ఇపుడు ఎటూ కేంద్రం ఈ బాధ్యతను రాష్ట్రానికి వదిలేసింది కాబట్టి చర్చలు జరపాలి.

ఇప్పటికే మూడు రాజధానుల కధ హై కోర్టులో విచారణ దశలో ఉంది. అది ఎప్పటికి తెములుతుంది అన్నది తెలియది. ఇక హై కోర్టు తరలింపు కూడా అందులో భాగం కాబట్టి తీర్పు వచ్చే వరకూ ఆగాల్సిందేనా అన్న మాట కూడా న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇక మరో వైపు అన్నీ అమరావతిలోనే ఉంచాలంటూ రైతులు వేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయిస్తుంది. లేకపోతే వ్యతిరేకంగా వచ్చినా కూడా రెండో వారు హై కోర్టుకు వెళ్తారు. అందువల్ల అంత ఇది పూర్తిగా సాగతీత కోసమే కేంద్రం ఇలా మాట్లాడి తప్పుకుందని అంటున్నారు. నిజానికి చంద్రబాబు అమరావతి లో హై కోర్టు అన్నపుడు ఎవరిని సంప్రదించారని అన్న ప్రశ్న ఉంది. ఇపుడు జగన్ ప్రభుత్వం కూడా కర్నూల్ లో పెడుతూ చట్టం చేసింది కాబట్టి దాని మీద తీర్పును చూసుకుని మార్చుకోవచ్చా అన్న చర్చ కూడా ఉంది