కార్యాలయంలో ప్ర‌భుత్వ ఉద్యోగులు మొబైల్ ఫోన్ వాడొద్దు: మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విధుల్లో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగులు ఆఫీసు వేళల్లో త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల కోసం మొబైల్ ఫోన్ వాడ‌రాద‌ని కోర్టు తెలిపింది. ఈ రూల్స్‌ను పాటించ‌ని ఉద్యోగుల‌పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా హైకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది.