బాబు పాపులారిటీ పెంచుతున్న నాగబాబు.!

Gogineni Babu

Gogineni Babu

సినీ నటుడు నాగబాబు, ‘హ్యూమనిస్ట్’ అని చెప్పుకునే మేధావి బాబు గోగినేని (బిగ్ బాస్ కంటెస్టెంట్) పాపులారిటీ పెంచుతున్నరాట. అలాగని, స్వయంగా బాబు గోగినేని ఓ సెటైర్ ద్వారా వెల్లడించారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన నేపథ్యంలో, జనసేన పార్టీ ఓ ఫొటో విడుదల చేస్తే, దాన్ని బొమ్మగా గీసిన ఓ అభిమాని, అందులో వివేకానందుడ్నీ, చేగువేరాను పొందుపర్చడం బాబు గోగినేనికి నచ్చలేదు. ఆ ఫొటో మీదా, పవన్ కళ్యాణ్ మీదా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు బాబు గోగినేని. మరోపక్క, సినీ నటుడు తనికెళ్ళ భరణి ‘శెబాష్ రా శంకరా’ పేరుతో రాసిన ఓ కవిత విషయంలో కూడా బాబు గోగినేని అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కారు. నాగబాబుకి ఈ విషయాల్ని కొందరు తెలియజేస్తే, నాగబాబు తనదైన శైలిలో స్పందిస్తూ, ‘నాకున్న పెంపుడు కుక్కలు చాలు.. ఇలాంటివి నాకు పంపించొద్దు’ అని సెటైర్ వేశారు.

దాంతో, బాబు గోగినేని మరింత రెచ్చిపోతూ, ‘మీ పెంపుడు కుక్కలు నన్ను రెచ్చగొడుతున్నాయి..’ అంటూ బాబు గోగినేని మరింత రెచ్చిపోయారు. మేధావి అంటే, సమాజానికి ఉపయోగపడాలి. కరోనా నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడగలగాలి. ఇవన్నీ మానేసి, పాపులారిటీ పెంచుకునేందుకు వివాదాలను ఆశ్రయించడమేంటి.? అన్నటికీ మించి హ్యూమనిస్టు.. అనగా మానవతావాదినని చెప్పుకునే బాబు గోగిగేనికి, కరోనా బారిన పడి, మంచాన పడ్డ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు ఎలా చెయ్యగలిగారో ఏమో. నాగబాబు స్పందనతో తన పాపులారిటీ పెరిగిందని గోగినేని బాబు చెబుతున్నారంటే, ఆయన బాగానే ముందస్తు సన్నాహాలు చేసుకున్నాడన్నమాట, నాగబాబుని కెలికే విషయంలో. పబ్లసిటీ కోసం పాకులాడే వ్యక్తి తన పేరు ముందు హ్యూమనిస్ట్.. అని పెట్టకోవడం మానేస్తే మంచిదేమో.