Suicide: అనారోగ్యంతో ప్రియురాలి మరణం.. ఎడబాటు భరించలేక ప్రియుడి ఆత్మహత్య..!

Suicide: ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే ప్రేమ , పెళ్లి అంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. యువతీ యువకులు ఆకర్షణ వల్ల అది ప్రేమ అని భ్రమపడి చదువును నిర్లక్ష్యం చేస్తూ తల్లిదండ్రులను ఎదిరించి స్థాయికి దిగజారి పోయారు. చాలామంది యువత ప్రేమ పేరుతో పెద్దలను మోసం చేస్తూ వారిని ఎదురించి ఇంటి నుండి పారిపోతున్నారు. ఇంకొంతమంది సిన్సియర్ గా ప్రేమించుకుని పెద్దలనీ ఒప్పించి వారి అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒకటి అవుతున్నారు. కానీ కొంతమంది జీవితాలలో మాత్రం ఈ ప్రేమ విషాదాన్నే నింపుతోంది. తాజాగా ఇటువంటి సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..నెన్నెల మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన జాడి రవి(18),వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్యశ్రీ ఏడాది నుండి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు వారి ప్రేమలో లేనమయ్యరు. ఈ ఇద్దరు నీ చూసి దేవుడికి అసూయ కలిగినట్లు ఉందేమో.. ఒకరి కోసం ఒకరు బతుకుతున్న వీరి ప్రాణాలు తేసుకెళ్ళిపోయాడు. సత్యశ్రీ తరచూ అనారోగ్యం తో ఇబ్బంది పడుతూ ఉండేది. ఈ క్రమంలో సత్య శ్రీ అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించారు.
కానీ సత్య శ్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి రెండవ తేదీన మరణించింది .

ప్రియురాలి మరణవార్త తెలుసుకున్న రవి మానసికంగా ఎంతో కృంగిపోయాడు. ఆమె లేని లోటు ను ఎవరు తీర్చలేరు అంటూ ఎడబాటును భరించలేక మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతనిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రవి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసిన రవి ప్రాణాల్ని కాపాడలేకపోయారు. రవి మరణించిన విషయాన్ని రవి సోదరుడు జాడి రమేష్ పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.